CM Revanth Reddy Announce Caste Census : సచివాలయంలో బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ శాఖల బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్రెడ్డి, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో త్వరలో కులగణన చేయనున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఎన్నికల హామీల అమలులో భాగంగా కులగణనకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. సచివాలయంలో బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ శాఖల బడ్జెట్ ప్రతిపాదనలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
CM Revanth Reddy Announce Caste Census : ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాన్ని వేర్వేరు ప్రాంతాల్లో కాకుండా, ఒకే చోట ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. అన్ని గురుకులాలు ఒకే చోట ఉండేలా అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్(Integrated Education Hub) ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనివల్ల గురుకులాల నిర్వహణ, పర్యవేక్షణ, అజమాయిషీ మరింత మెరుగవుతుందని సీఎం పేర్కొన్నారు.
CM Revanth Review on BC and Minority Department : ఎక్కువ మంది విద్యార్థులు ఒకే ప్రాంగణంలో చదవడం వల్ల వారిలో ప్రతిభా పాటవాలు, పోటీతత్వం పెరుగుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. ఎడ్యుకేషన్ హబ్ల నిర్మాణానికి అవసరమైన స్థలాలను వెంటనే గుర్తించాలని, నియోజకవర్గ కేంద్రంలో వీలు కాకపోతే అదే సెగ్మెంటులోని మరో పట్టణం లేదా మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని సూచించారు.
అవును నేను మేస్త్రీనే- తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రీని: సీఎం రేవంత్రెడ్డి
ఇప్పటికే 20 ఎకరాలకు పైగా విస్తీర్ణమున్న గురుకులాల్లో మిగతా భవనాలను నిర్మించి హబ్గా తీర్చిదిద్దాలన్నారు. ఎడ్యుకేషన్ హబ్ల నిర్మాణానికి కార్పొరేట్ సంస్థల(Corporate Bodies) సహకారం తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఎడ్యుకేషన్ హబ్ భవనాల నిర్మాణం కోసం సీఎస్ఆర్ నిధులను సమీకరించడంతో పాటు, దాతల నుంచి విరాళాలు స్వీకరించాలని ముఖ్యమంత్రి తెలిపారు.
గ్రీన్ఛానల్ ద్వారా డైట్, కాస్మోటిక్ ఛార్జీల చెల్లింపు : అద్దె భవనాల్లో ఉన్న గురుకులాలకు, యుద్ధ ప్రాతిపదికన సొంత భవనాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ ఛార్జీలు, వంట బిల్లులు పెండింగ్ లేకుండా గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లించాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. సంక్షేమ హాస్టళ్లలో(Welfare Hostels) మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు ఇచ్చే దుప్పట్లు, నోట్ బుక్స్, యూనిఫామ్స్, పుస్తకాలకు కూడా సీఎస్ఆర్ ద్వారా నిధులు సమీకరించాలని సూచించారు.
Telangana Govt Conduct Caste Census : ప్రతీ పార్లమెంటు నియోజకవర్గానికి ఒక బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసేలా అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. మహాత్మ జ్యోతిభాపూలే(Mahatma Jyotiba Phule) ఓవర్ సీస్ స్కాలర్ షిప్ స్కీమ్ను మరింత సమర్థంగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు. ఎక్కువ మంది అర్హులకు మేలు జరిగేలా చూడాలని తెలిపారు. ర్యాంకింగ్ల ఆధారంగా టాప్ విదేశీ యూనివర్సిటీలకు వెళ్లే విద్యార్థులకు మొదటి ప్రాధాన్యమివ్వాలని సూచించారు.
also read-How To Detect Deepfake Images In Telugu
ఏపీలో మొదలైన కులగణన…
మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న వేళ సీఎం జగన్ (CM Jagan) ఏపీలో కులగణన ప్రక్రియకు ప్రారంభించారు. ఇది కేవలం ఎన్నికల స్టంట్ అని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుంటే.. లేదు ప్రజలు సంక్షేమం కోసమే తాము కులగణన చేస్తున్నామని వైసీపీ పేర్కొంది. ఇదిలా ఉండగా.. గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఆధ్వర్యంలో ఏపీలో ఉన్న కోటీ 60 లక్షల కుటుంబాలను కులగణన సర్వే చేస్తోంది ఏపీ (AP) సర్కార్. రాష్ట్రంలో ఉన్న మొత్తం 723 కులాలకు సంబందించి ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలుగా విభజించనున్నారు. బుడగ జంగాలు, పిరమలై కల్లర్(తేవర్), యలవ కులాలను ఇతర కులాల జాబితాలో నమోదు చేస్తారు. జనవరి 19 ప్రారంభమైన ఈ సర్వే ఈ నెల 28 వరకూ మొత్తం పది రోజులపాటు జరగనుంది. వాలంటీర్లతో ఇంటింటి సర్వే చేస్తున్నారు. ఒకవేళ ఎవరన్నా మిస్ అవుతే జనవరి 29 నుంచి ఫిబ్రవరి 2 వరకూ దగ్గరలోని సచివాలయంలో నమోదు చేసుకునే అవకాశం కల్పించింది వైసీపీ ప్రభుత్వం.
బీహార్ లో పూర్తి..
దేశంలో మొట్టమొదటి సరిగా కులగణన (Caste Census) చేపట్టింది బీహార్ సర్కార్. ఆ తరువాత స్థానాన్ని ఆంధ్ర ప్రదేశ్ కైవసం చేసుకుంది. ఇటీవల బీహార్ లో కులగణన ప్రక్రియ ముగిసింది. కులగణన చేయడం ద్వారా బీహార్ లో జనాభా భారీగా పెరిగిందని అక్కడి ప్రభుతం పేర్కొంది. అయితే.. ఈ కులగణన ప్రక్రియకు కేంద్రం లో ఉన్న బీజేపీ వ్యతిరేకిస్తోంది. కుల గణనపై ఎప్పటికప్పుడు కేంద్రం దాటవేస్తుంది. కేంద్రం తీరును పక్కకు పెట్టి వరుసగా కుల గణన చేపడుతున్నాయి రాష్ట్రాలు.
నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటేడ్ హబ్
ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థలన్నీ వేర్వేరు చోట్ల విడివిడిగా కాకుండా ఇంటిగ్రేటేడ్ ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేయాలన్నారు. నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటేడ్ హబ్ నిర్మించే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. దీంతో స్కూళ్ల నిర్వహణ, పర్యవేక్షణ, అజమాయిషీ కూడా మరింత మెరుగ్గా చేసే వీలుంటుందని అభిప్రాయపడ్డారు. ఎక్కువ మంది విద్యార్థులు ఒకే ప్రాంగణంలో చదువుకోవటం ద్వారా వారిలో నైపుణ్యాలు పెరుగుతాయని, పోటీతత్వం పెరుగుతుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. వెంటనే అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఎడ్యుకేషన్ హబ్ ల నిర్మాణానికి సరిపడే స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. నియోజకవర్గ కేంద్రంలో వీలు కాకుంటే ప్రత్యామ్నాయంగా అదే సెగ్మెంట్లో మరో పట్టణం లేదా మండల కేంద్రాలను ఎంచుకోవాలని సూచించారు. ఇప్పటికే 20 ఎకరాలకుపైగా విస్తీర్ణమున్న స్కూల్ ప్రాంగణాల్లో మిగతా భవనాలు నిర్మించి హబ్ గా తీర్చిదిద్దే అవకాశాలుంటే పరిశీలించాలని అన్నారు.
కార్పొరేట్ సహకారం తీసుకోవాలి
ఎడ్యుకేషన్ హబ్ ల నిర్మాణానికి కార్పొరేట్ సంస్థల, కంపెనీల సహకారం తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ) ఫండ్స్ ను సమీకరించాలని, ముందుకు వచ్చే దాతల నుంచి విరాళాలు స్వీకరించి ఈ భవన నిర్మాణాలు చేపట్టాలన్నారు. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో అవసరమైన మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు ఇచ్చే దుప్పట్లు, నోట్ బుక్స్, యూనిఫామ్స్, పుస్తకాలకు కూడా సీఎస్ఆర్ ద్వారా నిధులు సమీకరించాలని సూచించారు.
కళ్యాణ మస్తు, షాదీ ముబారక్ లబ్ధిదారులకు నగదుతో పాటు తులం బంగారం అందించేందుకు అంచనా బడ్జెట్ ను రూపొందించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పుడున్న బీసీ స్టడీ సర్కిళ్లను ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం యూనిట్ గా ఏర్పాటు చేసే అంశంపై అధ్యయనం చేయాలన్నారు.